టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో, తొలిరోజు తొలిఆటతో ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ ని సంపాదించింది. అయితే మొదటి మూడు రోజలు ఒకింత సెలవలు రావడంతో, కలెక్షన్స్ బాగానే రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత చాలా ప్రాంతాల్లో అత్యల్పంగా మాత్రమే కలెక్షన్స్ ని సంపాదించింది. బాహుబలి రెండు భాగాల సూపర్ సక్సెస్ తరువాత వచ్చిన ప్రభాస్ సినిమా కావడం, అదీకాక హాలీవుడ్ రేంజ్ లో భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించడంతో, ప్రేక్షకులు సాహో పై ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే చివరికి సినిమా రిలీజ్ రోజున థియేటర్ కు వెళ్లిన వారి ఆశలు చాలావరకు అడియాశలు చేసారు సినిమా యూనిట్. సినిమాలో భారీ స్థాయిలో కేవలం గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ కోసం మాత్రమే ఖర్చుపెట్టిన సినిమా యూనిట్, 

సినిమాలో ప్రధానమైన కథ మరియు కథనాలపై దృష్టిపెట్టలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. అదీకాక గతంలో వచ్చిన ఒక ఫ్రెంచ్ హిట్ సినిమాను కాపీ కొట్టి తీశారన్న వాదనలు కూడా అక్కడక్కడా విపరీతంగా వినపడ్డాయి. చివరకు చాలావరకు నష్టాలతో ప్రస్తుతం ముందుకు నడుస్తున్న సాహో తరువాత ప్రభాస్ నటిస్తున్న జాన్ సినిమాపైనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, సాహో విషయమై చేసిన తప్పిదమే ప్రభాస్, ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న జాన్ విషయంలోనూ చేస్తున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ వార్తలను బట్టి, జాన్ సినిమాలో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలే ఉండనున్నాయని, అలానే సాహో మాదిరిగా ఎక్కువగా గ్రాండియర్ కు మాత్రమే సినిమా యూనిట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. 

1800వ దశకంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా సగటు ప్రేక్షకుడికి కావలసిన కమర్షియల్ అంశాలు లేవని ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఈ విషయమై కొందరు సినీ విశ్లేషకులు స్పందిస్తూ, ప్రస్తుతం ఇంకా చిత్రీకరణ దశలో ఉన్న జాన్ మూవీ విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలు చాలావరకు పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి న్యూస్ బయటకు రాలేదని, కాబట్టి ఇటువంటి న్యూస్ ని పట్టించుకోవలసిన అవసరం లేదని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం, జాన్ షూటింగ్ పూర్తి అయి రిలీజ్ అయ్యేవరకు వేచిచూడాల్సిందే....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: