టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన కెరీర్ సిల్వర్ జూబిలీ మూవీ గా వచ్చిన మహర్షి సినిమాతో అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇచ్చిన మంచి జోష్ తో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్, ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే 27వ సినిమా విషయమై గత కొద్దిరోజలుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. కొందరేమో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మహేష్ చేస్తున్నారు అంటుంటే, మరికొందరు పరశురామ్ తో చేస్తున్నారు అని వార్తలు ప్రచారం చేసారు. ఇక రెండు రోజుల క్రితం మహేష్ బాబు, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ను కలిసి ఒక స్టోరీ చెప్పడం, అలానే అయన చెప్పిన స్టోరీ లైన్ మహేష్ కు అమితంగా నచ్చడంతో, తన 27వ సినిమాను ప్రశాంత్ తోనే చేయాలని మహేష్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయమై నేడు ఒక సంచలన వార్త ప్రచారం అవుతోంది. ఆరోజున దాదాపుగా రెండు గంటలకు పైగా తమ సినిమా స్టోరీ విషయమై మహేష్ మరియు ప్రశాంత్ ల మధ్య చర్చలు జరిగాయని, 

అయితే మధ్యలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుందని అని భావించినప్పుడు అటు మహేష్, ఇటు ప్రశాంత్ ఇద్దరూ కూడా కీర్తి సురేష్ అయితే బెటర్ అని భావించినట్లు సమాచారం. క్యారెక్టర్ పరంగా హీరోయిన్ కి కూడా మంచి స్కోప్ ఉన్న ఈ సినిమా కథకు హీరోయిన్ గా ఆమె అయితేనే కరెక్ట్ అని ఇద్దరూ ఆమెనే ఫిక్స్ అయ్యారట. ఇక మరోవైపు మహేష్ ఫ్యాన్స్ కూడా సూపర్ స్టార్ తో మహానటి ఎప్పుడు జతకడుతుందో అని వేయి కళ్ళతో ఎదురుచూపులు చూస్తున్నారు కూడా. మరి దీనిని బట్టి, నేడు ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ వార్త కనుక ఒకవేళ నిజమే అయితే మాత్రం, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా పెద్ద పండగ వార్తే అని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: