అవళ్ ఫేమ్ మిలింద్ రావ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ నిర్మిస్తున్నాడు. నిర్మాతగా విగ్నేష్ కు ఇదే మొదటి సినిమా. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార పాత్ర చాలా కొత్తగా ఉండనుందట. ఈరోజు ఈ చిత్రం యొక్క షూటింగ్ చెన్నై లో ప్రారంభమైంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈచిత్రం విడుదలకానుంది . ఇక నయనతార నటించిన రెండు భారీ సినిమాలు వచ్చే నెలలో ప్రేక్షకులముందుకు రానున్నాయి. అందులో ఒకటి మచ్ అవైటెడ్ మూవీ సైరా.. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన్ , మెగా స్టార్ చిరంజీవి కి జోడిగా నటించింది. అక్టోబర్ 2నఈసినిమా విడుదలకానుంది.
ఇక రెండవది తమిళ్ సినిమా బిగిల్. ఈ చిత్రంలో ఇళయదళపతి విజయ్ కి జోడీగా నటించింది నయనతార. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది. ఈరెండు సినిమాల ఫై సౌత్ లో భారీ అంచనాలు వున్నాయి. ఇక నయన్ ,నేత్రికన్ తో పాటు ప్రస్తుతం రజినీకాంత్ సరసన దర్బార్ అనే చిత్రంలో నటిస్తుంది. కాగా రజినీ తో ఆమెకు ఇది రెండో చిత్రం గతంలో వీరిద్దరు కలిసి కథానాయకుడు సినిమా లో నటించారు.