శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత మళ్ళీ ఇంకో సినిమా రెడి చేయడానికి చాలా సమయమే పట్టింది. వాస్తవంగా ఫిదా అవగానే వెంటనే మరో సినిమాతో వస్తాడనుకున్నారు అందరు. కానీ ఎందుకనో ఏ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. కాని వాస్తవంగా అంతా కొత్త వాళ్ళతో శేఖర్ కమ్ముల ఒక సినిమా మొదలు పెట్టాడు. ఫారిన్ లో కొంతవరకు షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు గాని ఉన్న పలంగా శేఖర్ కమ్ముల ఆ సినిమాను ఆపేశాడు. ఆ తర్వాత నాగ చైతన్య  - సాయి పల్లవి లతో సినిమాను చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. శేఖర్ కమ్ముల ఈ సినిమాను ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ని లాక్ చేసేసారని లేటెస్ట్ అప్‌డేట్. 

ప్రస్తుతం మొదటి షెడ్యుల్ లో ఉన్న ఈ సినిమా మరో రెండు షెడ్యుల్స్ లో  షూటింగ్ కంప్లీట్ చేయాలని చిత్ర బృందం పక్కా ప్లాన్ చేశారట. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ చివరై వారం లోగా సినిమా రెడీ కాబోతోంది. జనవరిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇక జనవరి లో డేట్స్ లేవు అన్న సంగతి తెలిసిందే. పైగా ఫిబ్రవరి 14 ఈ సినిమాకు పర్ఫెక్ట్ డేట్ కావడంతో అదే డేట్ కి ఫిక్సయ్యారట. ఇక ఈసినిమాలో లవ్ సీన్స్ అలాగే సాయి పల్లవి డాన్స్ - చైతూ డైలాగ్స్ హైలైట్ అని తెలుస్తోంది.

అక్కినేని హీరోలంటేనే లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రెస్. మరి ఈ లవ్ స్టోరీతో చైతూ మరో సూపర్ హిట్ అందుకొని లవర్ బాయ్ అనిపించుకుంటాడెమో చూడాలి. ఈ సినిమాకు రెహమాన్ దగ్గర పనిచేసిన పవన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిదా లాగే ఈ సినిమాకు కూడా సాంగ్స్ ప్లస్ కాబోతున్నాయని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చైతూ నాగార్జున తో కలిసి బంగార్రాజు సినిమాలో నటించబోతున్నాడు. ఫిదా తర్వాత సాయి పల్లవికి మళ్ళీ చెప్పుకోదగ్గ హిట్ పడలేదన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా మీద సాయి పల్లవి చాలా ఆశలు పెట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: