నిన్నరాత్రి హైదరాబాద్ లో జరిగిన ‘వాల్మీకి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్లోగన్ ను రిపీట్ చేయడం మెగా అభిమానులకు జోష్ ను కలిగించింది. ‘వాల్మీకి’ ట్రైలర్ తన బాబాయ్ చూసి అభినందించడమే కాకుండా తెలంగాణ యాసలో మాట్లాడిన తన డైలాగ్ డెలివరీ చూసి తనకు ‘గబ్బర్ సింగ్’ హిట్ ఇచ్చినంత రేంజ్ లో ‘వాల్మీకి’ హిట్ కాబోతోంది అంటూ పవన్ చెప్పిన మాటలను బయటపెడుతూ ఈ మూవీ సూపర్ హిట్ కాబోతున్న సంకేతాలను ఇచ్చాడు.

అంతేకాదు తన ఉపన్యాసం చివరిన ‘జైహింద్’ అంటూ వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ లా ఉద్వేగభరితంగా స్లోగన్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇదే ఈవెంట్ లో వరుణ్ చిరంజీవి గురించి మాట్లాడుతూ తన డాడీ తనకు ఇచ్చిన ఒక సలహాను బయటపెట్టాడు. 

ఒక హీరో ఎన్నిరకాల సినిమాలు చేసినా మాస్ సినిమాలు చేసే సమయంలో వచ్చే కిక్ వేరని తనకు అనేకసార్లు చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ అలాంటి కిక్ తనకు ‘వాల్మీకి’ మూవీలో దొరికింది అంటూ పరోక్షంగా చిరంజీవిని గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో ‘సైరా’ గురించి మాట్లాడుతూ ఆమూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయమని మెగా అభిమానులకు పిలుపు ఇచ్చాడు.

అత్యంత కోలాహలంగా జరిగిన ఈ ఫంక్షన్ లో వరుణ్ తనకు వెంకటేష్ తో ఏర్పడిన బంధం గురించి మాట్లాడుతూ వెంకీ పై ప్రశంసలు కురిపించాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత ఒక పక్కా మాస్ సినిమా ఇప్పటివరకు విడుదల కాని పరిస్థితులలో ‘వాల్మీకి’ నిజంగానే మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ కాగలిగితే వరుణ్ తేజ్ ను మాస్ హీరోగా నిలబెట్టడం ఖాయం అన్న మాటలు నిన్నటి ఈవెంట్ కు వచ్చిన అతిధుల మాటలలో వినిపించింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: