బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో.. గత నెల 30 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా భారీ యాక్షన్ తో ఎంట్రీ ఇచ్చిన సినిమా హాలీవుడ్ రేంజులో ఉంటుంది. అంతే కొత్తగా రొమాన్స్ ను కూడా పండించాడు. కానీ, ప్రభాస్ అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయాడు. 

సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అతగాడికి రెండో సినిమా.. యాక్షన్ తో కొత్త ప్రభాస్ ను వెలుగులోకి  తీసుకొస్తానని చెప్పి టోటల్ సినిమా టాక్ ను తలక్రిందులు చేసాడని  ఫ్యాన్స్ చేత మాటలను అనిపించుకున్నాడు. దానితో టాలీవుడ్ లో తలెత్తుకోలేక పోయాడు.  ప్రభాస్ కూడా ఫ్యాన్స్ ఎక్సపెక్టషన్స్ రీచ్ అవ్వలేదని ఫీల్ అయ్యాడు. 
 
అంతేకాకుండా మరోసారి ఆ తప్పుచేయను అని అయన ఫ్యాన్స్ కి సారి కూడా చెప్పాడు. ఇప్పటిలో ప్రభాస్ సినిమా చేసే పనిలో ఉండడని అర్థమయింది. అయితే, తాజాగా డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాకు ముందు ఎన్నో ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రభాస్ సినిమా రిలీజ్ అయినా రెండు వారాలకు మీడియా ముందుకొచ్చాడు. 

ఈ సందర్బంగా అయన కొన్ని వ్యాఖ్యలు చేసారు. హిందీ ప్రజలు వాళ్ళ సినిమాలే ఆదరిస్తారు అంటూ వస్తున్నా రూమర్లకు ప్రభాస్ కూడా నిజమని ఒప్పుకున్నాడు. అక్కడ వేరే సినిమాకే ఆదరణ ఉంటె అన్ని తెలుగు సినిమాలు హిట్ అవుతాయి అంటూ ప్రభాస్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ ఆ మీడియాలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఆలోచన ముందే ఉంటె సాహో సినిమా హిట్ అయ్యేది కదా అని కొందరు నెటిజన్లు అంటున్నారు.. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారో అన్న వార్త సినీ ఇండస్ట్రీలో వినపడుతుంది. మరి ఎవరికీ ఆ అవకాశమిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: