టెలివిజన్ రంగంలో అప్పటి వరకు మూస పద్దతిలో కొనసాగుతున్న ఎన్నో కార్యక్రమాలకు చెక్ పెట్టి ఎన్నో వినూత్న ప్రయోగాలతో రియాల్టీ షోలను నిర్వహించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యాంకర్ ఓంకార్.  అప్పట్లో యాంకర్ ఓంకార్ చేసిన ప్రయోగాలు ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. మొదట్లో జీటీవీ లో ఆట పేరుతో ఒక డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలు పెట్టారు, పిల్లలతో సైతం చిత్రవేషధారణ కుప్పిగంతులు వేయించేవాడు. తర్వాత ఇంకేదో చిత్రమైన పిల్లల ప్రోగ్రాం ఒకటి చేశాడు. 

 ఎంతో మంది ఔత్సాహికులు వెలుగు లోకి వస్తున్నారు. యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఓంకార్ ఇప్పుడు దర్శకుడిగా మారారు.   90 లలో టివీ సీరియల్స్ లోనూ కొన్ని సినిమాలలోనూ తన వైవిధ్యమైన గొంతుతో వెటకారపు సంభాషణలతో కనిపించేవాడు అతనేనా? ఓంకార్ తర్వాత మంచి దర్శకుడిగా తన సత్తా చాటుతాడని ఎవరూ ఊహించలేదు. ఆట ప్రోగ్రాం తో ఆగిపోకుండా జీనియస్ మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, తొలిచిత్రం కలిసిరాకపోయినా కుంగిపోలేదు. కసిగా మళ్ళీ తన సత్తా చాటే  ప్రయత్నం చేసాడు.

అలా చిన్న మూవీ రాజుగారి గదిలో హిట్ కొట్టిన ఓంకార్, తానేమిటో చాటిచెప్పాడు. ఆతర్వాత నాగార్జున తో ‘రాజు గారి గది -2’ డైరెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ రాజుగారి గది 2 ఊహించిన ఫలితాలు అందివ్వలేక పోయింది. మొత్తానికి ఈ మూవీ తో కాస్త కష్టాల్లో పడ్డ ఓంకార్ తర్వాత  మూవీతో మంచి సక్సెస్ పొందాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజుగారి గది 3 కి భారీ సన్నాహాలు చేస్తున్నాడు.  ఈ మూవీలో కాస్త హర్రర్ డోస్ ఎక్కువే పెంచుతున్నట్లు తెలుస్తుంది.

అవికా గోర్, అశ్విన్ బాబు ప్రధాన పాత్రల్లో ఓంకార్ నిర్మిస్తున్న 'రాజుగారి గది-3' ట్రయిలర్ విడుదలైంది. ట్రయిలర్ లోనే దెయ్యంగా అవికా గోర్ భయపెడుతోంది. ట్రయిలర్ వినూత్నంగా ఉండి, ఇది హారర్ చిత్రమని చెప్పకనే చెబుతోంది. "ఈ కన్యను తాకాలని చూస్తే... నీకు తప్పదు మరణం" అని అశ్విన్ బాబు చెప్పిన డైలాగ్, దాని ముందు అశ్విన్ నటన, ట్రయిలర్ కు హైలైట్ గా నిలిచాయి. ఈ ట్రయిలర్ ను 4కే రెజల్యూషన్ లో సోషల్ మీడియా వేదికగా, చిత్ర టీమ్ విడుదల చేసింది. దాన్ని మీరూ చూసేయండి. మొత్తాని ఈ టీజర్ చూస్తుంటే ఒళ్లు గగుర్బోడిచే సన్నివేశాలు ఉండబోతున్నట్లు కనిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: