సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో "సరిలేరు నీకెవ్వరు" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. దర్శకుడు అనిల్ రావిపుడి ఈ సినిమాని యాక్షన్ సన్నివేశాలతో పాటు వినోదాత్మకంగా కూడా తీర్చిదిద్దుతున్నారట. అందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసరుగా కనిపించనున్నారు.


అయితే ఈ సినిమా డిసెంబరు నాటికి పూర్తవుతుందట. సంక్రాంతికి విడుదల చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో చేయబోతున్నాడనేది సస్పెన్స్ గా మారింది. ఆల్రెడీ మహేష్ తో సినిమా చేయడానికి బౌండెడ్ స్క్రిప్ట్ తో ముగ్గురు డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని మహేష్ ఒప్పుకున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా, గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కూడా మహేష్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.


కానీ తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ ముగ్గురిని పక్కన పెట్టి మరో డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. కెజిఎఫ్ తో సంచలనాన్ని క్రియేత్ చేసిన ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడట. ఈ మేరకు ప్రశాంత్ మహేష్ ని కలుసుకున్నాడట. సరిలేరు నీకెవ్వరు పుర్తయ్యాక ఫిబ్రవరిలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవబోతుందని సమాచారం.


ప్రశాంత్ తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల  కారణంగా మిగతా ముగ్గురు డైరెక్టర్లు వేరే హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారట. ఆల్రెడీ సందీప్ వంగా బాలీవుడ్ లో సినిమా మొదలెట్టేశాడు. పరశురామ్ తన కథని వేరే హీరోలకి వినిపిస్తున్నాడట. ఇక వంశీ కూడా మరో హీరోని వెతుక్కునే పనిలో ఉన్నాడట.ఈ క్రేజీ కాంబినేషన్ మీద అందరికీ భారీ అంచనాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: