సీనియర్ ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ఉన్న మాస్ ఫాలోయింగ్, మాస్ ఫ్యాన్స్ ఎన్ని కోట్ల లో ఉన్నారో చెప్పడానికి లెక్కే లేదు. ఇక సహజంగా మాస్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి.  ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అందుకే ఇండస్ట్రీలో ప్రతి హీరో మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీ హీరోలు మాస్ అనే పదానికి కేరాఫ్ అడ్రెస్. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం ఆ రూటుకు భిన్నంగా మెగా ఫ్యామిలీ లో ముకుంద, కంచె, అంతరిక్షం వంటి సినిమాలు చేసి క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో ఒకటి అరా సినిమాలు ట్రై చేసినా ఫుల్ మాస్ సినిమా అయితే ఇంతవరకూ చేయలేదన్న సంగతి వరుణ్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. 'వాల్మీకి' తో మొదటి సారి మాస్ సినిమాల రుచి తెలిసిందని రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎగ్జైట్ అవుతూ చెప్పాడు వరుణ్.  

వరుణ్ మాట్లాడుతూ "ఇది నా 9 వ సినిమా. ఇప్పటివరకూ ఎక్స్ పరిమెంట్స్ అంటూ.. క్లాస్ సినిమాలంటూ.. లవ్ స్టోరీలంటూ ఏదో ఒకటి చేశాను. ఫస్ట్ టైం ఒక మాస్ సినిమా చేస్తే 'ఆ కిక్కే వేరప్పా. మామూలుగా లేదమ్మ'..అంటు ఈ డైలాగును పవన్ కళ్యాణ్ స్టైల్ లో చెప్పాడు. 'రేయ్ మేము మాస్ ఎందుకు చేస్తామో నీకు అర్థం కావడం లేదు.. మాస్ లో ఒక స్పెషల్ ఉంటుంది' అని చిరంజీవి గారు నాకు ఎప్పుడూ చెప్తుండేవారు. ఇప్పుడు ఫైనల్ గా ఆ రుచి కొంచెం చూశాను.  డాడీ థ్యాంక్ యూ సో మచ్" అంటూ వాల్మీకి సినిమా తనకు స్పెషల్ అన్నట్టుగా చెప్పాడు.

కళ్యాణ్ బాబాయ్ తో 'గబ్బర్ సింగ్' లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ గారితో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే తో చేసిన శోభన్ భాబు - శ్రేదేవి ల 'వెల్లువొచ్చి గోదారమ్మ' పాట ను యానాం లో షూటింగ్ చేశామని..అద్భుతంగా వచ్చిందని తెలిపాడు. ఇక మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గనక సూపర్ హిట్ అయితే వరుణ్ నుంచి మరిన్ని మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ ఆశించవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: