టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి సక్సెస్ ని అందుకుని మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. నిజానికి గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లేని పూరికి, ఇస్మార్ట్ శంకర్ మూవీ సక్సెస్ మంచి కిక్ ని ఇచ్చింది. ఇక ఆ సినిమా ఇచ్చిన కిక్ తో విజయ్ దేవరకొండతో తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసిన పూరి, నేడు తన పూరి కనెక్ట్స్ బ్యానర్ తరపున రెండు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం విశేషం. అందులో ఒకటి లేటెస్ట్ రేంజ్ రోవర్ కాగా మరొకటి లేటెస్ట్ బిఎండబ్ల్యూ మోడల్ కారు. 

అయితే ఎప్పటికపుడు తన సినిమాల లాభాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండే పూరి, ఇటీవల వరుస అపజయాలతో సతమతం అయిన విషయం తెలిసిందే. ఇక ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ సక్సెస్ తరువాత ఈ కార్లను కొనుగోలు చేయడం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. నిజానికి గత సినిమాలతో పూరి కనెక్ట్స్ బ్యానర్ కు సరియన సక్సెస్ లు లేకపోవడంతో ఆ బ్యానర్ కొంత నష్టాలూ పాలైందని, అయితే ఇంసార్ట్ శంకర్ మూవీ చాలావరకు లాభాలు కురిపించి పూరి గారికి మళ్ళి మంచి వైభవం తీసుకురావడం, అలానే ఆయన తన సంస్థ తరపున కొత్త కార్లను కొనుగోలు చేయడం ఆనందించదగ్గ విషయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక గత కొద్దిరోజలుగా తన పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి  నిర్మిస్తున్న సినిమాల్లో భాగస్వామిగా నటి ఛార్మి కూడా వ్యవహరిస్తున్నారు. 

ఇక  నేడు కొత్త కార్ల కొనుగోలు సమయంలో ఆ రెండు కార్ల తాళాలను పురీతో కలిసి ఛార్మి కూడా అందుకోవడం జరిగింది. ఇక అతి త్వరలో విజయ్ దేవరకొండతో పూరి నిర్మించే కొత్త సినిమా కోసం ఈ కార్లను వినియోగించనున్నట్లు సమాచారం.  మొత్తానికి రౌడీ హీరోతో కొత్త సినిమా మొదలెట్టాలనుకున్న సందర్భంలో, పూరి తమ నిర్మాణ సంస్థ కోసం ఇలా కొత్త కార్లు కొనుగోలు చేయడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కాగా పూరి, ఛార్మీలు ఆ కార్లతో కలిసి ఫోజులిచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: