టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం బల్గెరియా దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య కొన్నాళ్ల పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గాయాల పాలవడంతో కొంత షూటింగ్ వాయిదా పడడంతో, ఇకపై ఎక్కడా బ్రేకులు లేకుండా షూటింగ్ ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లనున్నారట దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అయితే ముఖ్యంగా ఈ సినిమాలోని కీలక యాక్షన్ సీన్స్ లో ఒకటైన పులి ఫైట్ ని ఈ షెడ్యూల్ లోనే తీయనున్నారట. 

కొమరంభీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ ఈ ఫైట్ సీన్ లో పులితో భీకర యుద్ధం చేస్తారట. అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ ఫైట్ సన్నివేశాన్ని ఆడియన్స్ ఏ మాత్రం డూప్ గా ఫీల్ అవ్వకూడదు అని భావించి దర్శకుడు రాజమౌళి, నిజమైన పులితో ఫైట్ ని తీయాలని నిర్ణయించారట. అంతేకాక ఫైట్ లోని కొన్ని డేంజర్ సన్నివేశాల్లో మాత్రం హీరో ఎన్టీఆర్ కి బదులు డూప్ ని పెట్టాలని నిర్ణయించారట. అయితే అందుకు ఏ మాత్రం ఒప్పుకొని ఎన్టీఆర్, టోటల్ ఫైట్ మొత్తం కూడా నిజమైన పులితో తానే పోరాడుతానని చెప్పడంతో మొదట యునిట్ షాక్ తిన్నారట. 

అయితే ఆ తరువాత పలువురు శిక్షకుల సారథ్యంలో ఆ భీకర పోరాటనాన్ని మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్ చిత్రీకరించిందట. ఇక ఈ సీన్ తరువాత ఎన్టీఆర్ పై ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రశంశలు కురిపించినట్లు సమాచారం. నేటి హీరోల్లో ఎక్కువమంది కొన్ని క్రిటికల్ సీన్స్ లో తమకు ఏదైనా జరుగుతుందని భావించి డూప్స్ ని తప్పనిసరిగా పెట్టుకుంటారని, అయితే ఎన్టీఆర్ ఏకంగా నిజమైన పులితో డూప్ లేకుండా పోరుకి సిద్దమై, నటించడానికి ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అని వారు అంటున్నారట. కాగా ఈ వార్త నిన్నటి నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: