ప్రస్తుతం బాహుబలి తర్వాత తెలుగు సినీ ప్రపంచం కోట్లను వసూల్ చేసే దిశగా సాగుతుంది.. ఆ సినిమా అంటే పెద్ద సినిమా అనుకోవచ్చు కానీ, చిన్న సినిమాల్లో చేసే హీరోలు కూడా బాగానే రెమ్యునరేషన్ కోసం ఆరాటపడుతున్నారు. ఎవరు చుసిన సినిమాలో నటించాలంటే కోట్లు ఘడిస్తున్నారు. సినిమాలు చేయాలంటే దర్శక నిర్మాతలకు తడిసి మోపాడు అవుతుందంటే నమ్మండి. 

ఇకపోతే.. బాహుబలి తర్వాత జక్కన్న అంతే హుందాగా ఉండాలని ఏకంగా ఇద్దరు హీరోలను పెట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా బాహుబలి ని తపించేలా ఉంటుందని ఆ చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక చుసుకునే మొన్న వచ్చిన సాహి సినిమా కూడా బారి బడ్జెట్ సినిమానే మిశ్రమ టాక్ తో వసూళ్లను రాబడుతుంది. రాజమౌళి వేసిన మొక్కకి మిగితా హీరోలకు కూడా నీళ్లుపోస్తూ వస్తున్నారు. అదే ఊపులో కోట్లను డిమాండ్ చేస్తున్నారు. 

విషయానికొస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా.. ఈ సినిమాలో కేవలం నాలుగు నిమిషాలు ఉండే ఓ సన్నివేశంలో నటించడానికి ఆయన 5కోట్లు డిమాండ్ చేశారట. ఇంతకీ అంత పెట్టేలా ఆ సినిమాలో ఏముంది అనుకుంటున్నారా... ఉందట. ఈ సన్నివేశానికి  స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలని, ఐస్ ల్యాండ్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా, పాయల్ రాజపుత్, నాభా నటేష్ హీరోయిన్లు. 

మొన్నటివరకు గోవాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఈరోజు నుండి యూరప్ లోని ఐస్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. 5 కోట్లతో రూపొందిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారట ఆ చిత్ర యూనిట్. అంతర్జాతీయ స్థాయిలో రూపొందే ఈ సన్నివేశం అందరికి తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్ వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: