‘సైరా’ విడుదలకు ఇక కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. సమయం దగ్గర పడుతున్నా రకరకాల కారణాలతో ఈ మూవీ ప్రమోషన్ ఇంకా మొదలు అవ్వకపోవడం చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగవలసి ఉంది. 

ఈ ఈవెంట్ ను ఇప్పుడు ఈనెల 22వ తారీఖుకు వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ వర్షాలు వస్తాయి అని వాతారణ శాఖ హెచ్చరికలు ఇచ్చింది అన్న సాకుతో ఈ ఈవెంట్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వాయిదా వెనుక అసలు కారణాలు వేరు అని అంటున్నారు. 

ఈ ఈవెంట్ కు మంత్రి కేటిఆర్ ను అతిధిగా రప్పించడానికి ఆయనకు అనుకూలమైన డేట్ కు ఈ ఈవెంట్ ను వాయిదా వేసారు అని కొందరు చెపుతుంటే మరి కొందరు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులతో జరుగుతున్న వివాదాలను సద్దుబాటు చేసుకున్న తరువాత ఈ ఈవెంట్ చేస్తే బాగుంటుంది అని కొందరు సూచించడంతో ఈ మార్పు జరిగింది అని అంటున్నారు. ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలు మెగా అభిమానులకు తీవ్ర నిరుత్సాహం కలిగిస్తున్నట్లు టాక్. 

దీనితో ముందు అనుకున్నట్లుగా ఈ మూవీ ట్రైలర్ అయినా రేపు విడుదలచేసి మెగా అభిమానులకు జోష్ ను ఇస్తారా ఇవ్వరా అనే విషయం పై కూడ స్పష్టత లేదు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఈ మూవీ నాన్ తెలుగు ఏరియాల మార్కెట్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనికి కారణం ‘సాహో’ ఫలితం అని అంటున్నారు. దాదాపు 270 కోట్ల భారీ బడ్జెట్ మూవీ విడుదల ఇక కేవలం రెండు వారాలే మిగిలి ఉన్నా చిరంజీవి చరణ్ లు ఈ మూవీ ప్రమోషన్ విషయంలో అనుసరిస్తున్న లో ప్రొఫైల్ ఎత్తుగడలలో ఎదో ఒక ఊహించని ఆలోచన ఉంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: