తెలుగు సినిమా రంగంలో కమెడియన్ గా దాదాపు ఇరవై సంవత్సరాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. ఆ తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి డబ్బులు బాగా సంపాదించిన బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మారాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా తీసి అదిరిపోయే లాభాలు అందుకున్నాడు. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ అప్పట్లో సచిన్ జోషి తో తీసిన సినిమా విషయంలో అనేకమైన విమర్శలు రావడం తర్వాత కోర్టుల దాకా గొడవలు వెళ్లడంతో సైలెంట్ అయిపోయాడు గణేష్. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టిన పండగనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు.


ఇదే క్రమంలో ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు బండ్ల గణేష్. తిరిగి ఇటీవల మల్లేష్ సినిమా రంగం లోకి రీ ఎంట్రీ ఇవ్వడం మూర్తం మహేష్ బాబు సినిమాతో ఫిక్స్ చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే ఒక పక్క సినిమాలు ఒప్పుకుంటుం మరోపక్క మళ్లీ ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ మారినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం  ఆయన ప్రొడక్షన్ హౌస్ మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. ఓ ప్రక్క నటన, మరో ప్రక్కన నిర్మాణం చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే నాని హీరోగా ఓ సినిమా ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, ప్రీ ప్రొడక్షన్ త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అయితే నిర్మాతగా స్టార్ డైరక్టర్స్ తో సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు కొత్తవారితో వెళ్లటం పట్ల ఇండస్ట్రీ లో చాలా మంది సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: