ఆగస్టు నెల 30వ తేదీన భారీ అంచనాలతో విడుదలైంది ప్రభాస్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన సాహో సినిమా. కానీ సాహో సినిమాకు ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. 300 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సాహో సినిమా బాలీవుడ్లో మాత్రమే బ్రేక్ ఇవెన్ కాగా మిగతా ప్రాంతాలలో భారీ నష్టాలు మిగిల్చింది. నిర్మాతలు సాహో సినిమాకు 425 కోట్ల రుపాయలు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని చెబుతున్నప్పటికీ సాహో సినిమా షేర్ 250 కోట్ల రుపాయల లోపే ఉందని సమాచారం. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాకు 42 కోట్ల రుపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తుంది. మరి సాహో సినిమా తరువాత సుజీత్ సినిమా ఏంటి ? ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటుందా అనే ప్రశ్నకు ఈ విషయంలో సుజీత్ రాజమౌళిని ఫాలో అవుతున్నాడని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 2009 సంవత్సరంలో మగధీర సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 
 
ఈ సినిమా తరువాత రాజమౌళి సునీల్ హీరోగా తక్కువ బడ్జెట్లో మర్యాద రామన్న అనే సినిమా తీశాడు. ప్రస్తుతం సుజీత్ కూడా రాజమౌళిలా తక్కువ బడ్జెట్లో ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే సుజీత్ తన దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమా వివరాలు, హీరో, నిర్మాత వివరాలు ప్రకటిస్తాడని సమాచారం. 
 
మరోవైపు సాహో అంచనాలను అందుకోకపోయినా సుజీత్ కు ప్రభాస్ మరో అవకాశం ఇస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ప్రభాస్ సుజీత్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని తెలుస్తోంది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాల్ని యువి క్రియేషన్స్ నిర్మించారు. మరి సుజీత్ దర్శకత్వంలో రాబోయే సినిమా యువి క్రియేషన్స్ నిర్మాతలే నిర్మిస్తారో లేక వేరే నిర్మాతలు నిర్మిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: