మెగాస్టార్ చిరంజీవి ౧౫౧ వ చిత్రంగా తెరకెక్కుతున్న సైరా నరిసింహ రెడ్డి సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ ని ఈ నెల 18 న జరపాలనుకోగా కొన్ని కారణాల వాళ్ళ చిత్రబృందం ఈ ఈవెంట్ ని క్యాన్సల్ చేసింది .కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కొత్త డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం . కాగా ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరసింహ రెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నాడు . అయితే మెగాస్టార్ కెరియర్ లోనే మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న" సైరా " రోజు రోజుకి అంచనాలను పెంచుతుంది .కాగా నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి .. తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు
అయితే ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ , ట్రైలర్ లకి విశేష స్పందన వచ్చింది .అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు .కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు . అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించాలనుకుంది చిత్ర బృందం . కాగా ఈ ఈవెంట్ ని ఈ నెల 18 న నిర్వహించాలనుకుంది కానీ కొన్ని కారణాల వల్ల 18 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేశారు .
కాగా ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ - ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను జరపనున్నట్లు చిత్రబృందం తెలిపింది . 22 న సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుందని చిత్రబృందం ప్రకటించింది. కాగా సైరా నరసింహ రెడ్డి భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో చిత్రం విడుదలయ్యాక ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి .