ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. కాగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రధాన భాషలన్నిటిలోనూ చిత్రం విడుదలకానుంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయట. అలాగే ఇంకొక పాట నేపథ్య సంగీతంతో పాటు పలు సన్నివేశాల్లో వినబడుతుందట. ఈ చిత్రం అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లాంటి స్వాతంత్ర్య యోధుల కథలతో కూడుకున్నది కావడంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో ఆరు పాటలు అనే ఫార్ములాను రాజమౌళి పక్కన పెట్టినట్లు ఉన్నాడు. మొత్తానికి కీరవాణికి పని తగ్గించాడు రాజమౌళి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి. అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రబోర్తిని తీసుకోనున్నారని తెలుస్తోంది. గతంలో ఇదే పాత్రలో నిత్యా మీనన్ ను తీసుకోవాలనుకున్నారు.
ఇక రాజమౌలి ఆర్ఆర్ఆర్ లోని కొన్ని సీన్స్ ను బల్గేరియాలో షూట్ చేస్తున్నారు. రాజమౌలి తన చిత్రబృందంతో 3 వారాల పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ కోసం బల్గేరియాలో షూట్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా ఎన్టీఆర్ చరణ్ లుక్స్ పై ఇండస్ట్రీలో అమితాసక్తి నెలకొని ఉంది. ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా, చరణ్ ని అల్లూరి గెటప్ లో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐతే వారి లుక్స్ రాజమౌళి ఎలా డిజైన్ చేయనున్నారు అనేది ఆసక్తికరం. వాస్తవానికి కొమరం భీమ్ కోరమీసం, తలపాగాలో ఉంటారు కాబట్టి, ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ గురించి అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇక అల్లూరి సీతారామ రాజు బాగా పెరిగిన గడ్డం మరియు జులపాలతో ఉంటారా..? ఒక ప్రక్క ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నా చరణ్ మాత్రం జుట్టు పెంచలేదు. మరి అల్లూరిగా చరణ్ ని చూపించడానికి జక్కన్న విగ్ ఏమైనా వాడుతాడా..? లేక, కొమరం భీమ్ లుక్ లానే తలపాగాతో లాగించేస్తారా.. చూడాలి. అలాగే ఈ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా 'బాహుబలి' తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.