మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది.  అయితే ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు పెద్ద మొత్తానికి అమ్ముడవగా ఇప్పుడు శాటిలైట్, హక్కులు రికార్డ్ ధర పలికినట్టు తెలుస్తోంది.  సినీ వర్గాల సమాచారం మేరకు ప్రముఖ ఛానెల్ జీటీవీ రూ.125 కోట్ల భారీ అమౌంట్ చెల్లించి రైట్స్ దక్కించుకుందట.  ఇవి అన్ని భాషలకు కలిపి చెల్లించిన మొత్తమట. ఇక ఈ శనివారం నాటికి ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన మిగిలిన అన్ని  పనులన్నిటినీ పూర్తి చేసుకోనుంది.  ఇక సినీ పరిశ్రమలోని కొంతమందికి సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందనే విషయం తెలిసిందే.  ముఖ్యంగా స్టార్ డైరెక్టర్  రాజమౌళికి ప్రత్యేకంగా  స్పెషల్ షో వేయనున్నారు. శనివారం నాడు  రాజమౌళికి ప్రసాద్ ల్యాబ్ లో ఈ ప్రత్యేక  షో వేస్తారట.  మొత్తానికి రాజమౌళి నుండి ఈ సినిమా అవుట్ ఫుట్ కి  సంబంధించి విలువైన సలహాలను సూచనలను తీసుకోవాలని  సైరా మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మెగా అభిమానులు మరియు మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సినిమా ట్రైలర్  కోసం బాగా వెయిట్ చేస్తున్నారు.  ఎలాగూ సాహో ఫీవర్ తగ్గిపోయింది కాబట్టి.. సైరాకి పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెరుగుతుంది.  ఈ టైంలోనే చిత్రబృందం ప్రచారానికి సంబంధించి  ప్రణాళికలను సిద్ధం చేసుకుని డేట్ ను అనౌన్స్ చెయ్యాలి. 


అప్పుడే ఈ సినిమా మిగిలిన భాషల్లోకి కూడా బాగా వెళ్తుంది.   హిందీలో  సైరాకి బజ్ రావాలంటే ఇంకా అక్కడ ప్రమోషన్స్ ను వేగవంతం చెయ్యాలి. పైగా  'వార్' మూవీ, సైరాకి హిందీలో పోటీగా రిలీజ్ అవుతుంది. మరి  ఆ పోటీలో నెగ్గాలంటే ప్రమోషన్స్ బలంగా చెయ్యాలి.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే  ఖచ్చితంగా  సైరా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ షోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు పెడుతూ.. సైరా సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని  భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: