మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకధీరుడు రాజమౌళి నిర్మిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాపై కేవలం మనదేశంలోనే కాక, ఇతర దేశాల్లోని ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ బల్గెరియా దేశంలో జరుగుతోంది. హీరోలు ఇద్దరితో పాటు పలువురు ముఖ్య నటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నట్లు సమాచారం. 

రామ్ చరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తుంటే, ఎన్టీఆర్ కు జోడిగా ఇటీవల ఒక బ్రిటిష్ నటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక సంచలన  వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే, ఈ సినిమా టైటిల్ గా నిర్ణయించిన ఆర్ఆర్ఆర్ అనే పదం మాదిరి, ఈ సినిమాలో కేవలం మూడంటే మూడు సాంగ్స్ మాత్రమే ఉంటాయని, అయితే ఆ సాంగ్స్ సినిమాలో సందర్భానుసారం వస్తాయని అంటున్నారు. 

ఇక ఆ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరహో అనే రేంజ్ లో ఉండనుందట. స్వరవాణి కీరవాణి సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ సినిమాకు కె కె సెంథిల్ కుమార్ కెమెరా మ్యాన్ గా పనిచేస్తుండగా, రాజమౌళి తండ్రి, వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల అంచనాలు అందుకుని సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: