దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అంటే అందరికి ముందు గుర్తొచ్చేది ఆయన చిత్రీకరించే పాటలు. హీరో హీరోయిన్ ఎవరైనా ఆయన అనుకున్నట్లు పాట తీయాల్సిందే. వల్గారిటి లేకుండా అద్భుతమైన రొమాన్స్ ని లిప్ లాక్స్ లేకుండా సాంగ్స్ ని పిక్చరైజ్ చేయడంలో దర్శకేంద్రుడి తర్వాతే ఎవరైనా. హీరోయిన్ నాభి సౌందర్యాన్ని దర్శకేంద్రుడు చూపించినంతగా మరే డైరెక్టర్ చూపించలేరు అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దీని మీద ఒక కార్యక్రమం కూడా ప్రసారమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఒక విషయంలో మన దర్శకేంద్రుడితో పోటి పడుతున్నాడు. వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ కామెడీతో పాటు ఒక రీమేక్ సాంగ్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుందని తాజా సమాచారం. అలనాటి క్లాసిక్ సినిమా 'దేవత'లో 'ఎల్లువచ్చి గోదారమ్మ' అనే సాంగ్ ను వాల్మీకి సినిమాలో రీమిక్స్ చేశారు.
 
అయితే ఇది కథలో భాగంగానే వస్తుందని, పెట్టాలని పెట్టిన సాంగ్ కాదంటూ చిత్ర యూనిట్ గత కొన్ని రోజుల నుండి చెప్తూ వస్తుంది. ఈ సాంగ్ ను వరుణ్ తేజ్ - పూజ హెగ్డే లపై చిత్రీకరించారు. మేకర్స్ సినిమాకు ఈ సాంగ్ హైలైట్ అవుతుందని భావిస్తుంటే ప్రేక్షకులు మాత్రం ఆ పాటను ఎక్కడ చెడగొడతారో అనే డైలమాలో ఉన్నారని తెలుస్తోంది. నిజానికి ఇది అప్పటి తరం పాటే అయినా ఇప్పటి తరం వారికి కూడా పరిచయమే. ఇక ప్రేక్షకులు ఇలా అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే మెగాస్టార్ గువ్వ గోరింకతో పాటను రీమిక్స్ చేశారు. కానీ మెగాస్టార్ ని తప్ప మరెవరిని ఊహించుకోలేకపోయారు ప్రేక్షకులు.

నిజానికి తెలుగు సినిమాల్లో కొన్ని బెస్ట్ డ్యూయెట్ సాంగ్స్ లో ఎల్లు వచ్చి ఒకటి. రాఘవేంద్రరావు అప్పట్లో ఆ సాంగ్ ను ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని పిక్చరైజేషన్ చేశాడు. బిందెల మధ్య శోభన్ బాబు, శ్రీదేవి లవి తో స్టెప్స్ వేయించి ప్రేక్షకులను ఫిదా చేసేశాడు. ఈ పాట కోసమే సినిమాను మళ్లీ మళ్లీ చూసిన ప్రేక్షకులు కొన్ని వేల మంది ఉన్నారు. అయితే ఇప్పుడు దర్శకేంద్రుడు తీసిన ఆ పాటను మళ్లీ చిత్రీకరించి హరీష్ ఎంత వరకూ మేజిక్ చేస్తాడో చూడాలి. లేదా వరుణ్ పూజా మెస్మరైజ్ చేస్తారా అనేది అర్థమవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: