మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ దాదాపు 270 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా సైరా. చిరు 151 వ సినిమా గా ప్రేక్షకులముందుకు వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, నిహారిక వంటి భారీ తారగణం తో రూపొందించారు. ఈ 'సైరా' అక్టోబర్ 2 న రిలీజ్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగుతో పాటు పలు భారతీయ భాషలలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమిళంలో ప్రముఖ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు చేస్తున్నారని తాజా సమాచారం. 

నిర్మాణరంగంతో పాటు పంపిణీలో కూడా మంచి అనుభవం ఉన్న సంస్థ కావడంతో 'సైరా' ను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో నయనతార లాంటి స్టార్ హీరోయిన్.. విజయ్ సేతుపతి లాంటి సెన్సేషనల్ హీరో కీలక పాత్రలలో నటించడం తమిళ ప్రేక్షకులను ఆకర్షించే అంశం. ఇక చిరంజీవి కూడా తమిళ ప్రేక్షకులకు తెలిసిన స్టార్ హీరోనే కాబట్టి సూపర్ గుడ్ ఫిలింస్ భారీ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక తెలుగులోనే కాకుండా తమిళ వెర్షన్ కు చెన్నై లో ఒక స్పెషల్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారట. సినిమాపై తమిళనాడులో భారీ క్రేజ్ ఉన్నా కూడా పాజిటివ్ టాక్ వస్తేనే భారీ విజయం అందుకునే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ హిస్టారికల్ సినిమాను 'సాహో' తరువాత  మళ్ళీ అంతే భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న టాలీవుడ్ సినిమా కావడంతో అన్ని రకాలుగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక రాబోయో రెండు మూడు రోజుల్లో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు మెగా హీరోలతో పాటు ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు హీరోలు హాజరు కానున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు మరికొందరు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: