మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని , ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సినిమా సైరా నరసింహారెడ్డి. రాయలసీమలోని కర్నూలు ప్రాంతానికి చెందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు జరగాల్సి ఉండగా, వాతావరణం సరిగా లేని కారణంగా ఆ ఫంక్షన్ ని మరొక నాలుగు రోజలు వాయిదా వేయడం జరిగింది. 

అయితే సైరా అధికారిక ట్రైలర్ మాత్రం రేపు సాయంత్రం 5గం. 31ని.లకు యూట్యూబ్ లో విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ లోని అంశాలు ఎలా ఉండబోతున్నాయనే విషయమై నేడు ఒక వార్త ప్రచారం ఆవుతోంది. దానిని బట్టి, ట్రైలర్ లో సినిమాలోని కీలక పాత్రలందరిని కొన్ని క్షణాలపాటు చూపించడం జరుగుతుందట. ఇక మెగాస్టార్ పలికే డైలాగ్స్ కు వీక్షకులు ముగ్ధులవుతారని, అలానే కొన్ని యాక్షన్ సీన్స్, ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ మరియు ప్రీ క్లైమాక్స్ తాలూకు యుద్ధ సన్నివేశాలను ట్రైలర్ లో చిన్న బిట్స్ రూపంలో చూపించడం జరుగుతుందట. ఇక మెస్మరైజింగ్ విజువల్ ఎఫెక్ట్స్ మరియు అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ అదిరిపోనుందని టాక్ వినపడుతోంది. 

మొత్తంగా ఈ ట్రైలర్ రిలీజ్ తరువాత, సైరా సినిమాపై అంచనాలు అమాంతం పెరగడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ వార్త ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతుండడంతో, మెగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టేసారు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతిబాబు తదితరులు పలు కీలక పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ సంగీత దర్శకులు అమిత్ త్రివేది సంగీతాన్ని, అలానే జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. రత్నవేలు అదిరిపోయే రేంజ్ లో ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ 2 న రిలీజ్ చేయనున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: