ఇటీవల చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథలతో రూపొందిన సినిమాలు అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం ఎక్కువగా సక్సెస్ అయిన పౌరాణిక చిత్రాలు మాత్రం ఇటీవల కాలంలో దాదాపుగా రాలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ వందల కోట్లలోనే ఉండనుంది. ఇక ఇందులో రాముడి పాత్రలో హృతిక్ రోషన్ నటించనుండగా, సీత పాత్ర కోసం దీపికా పదుకొనేను తీసుకున్నట్లు తెలుస్తోంది. 

హిందీతో పాటు దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ ప్రాంతీక భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారట. నిజానికి హృతిక్, దీపికను కూడా అనేక మార్లు ఒకటికి రెండు సార్లు అలోచించి మరీ ఆయా పాత్రలకు ఎంపిక చేయడం జరిగిందట. ఇకపోతే ఈ సినిమాలో రావణాసురుడి పాత్రను ఎవరితో చేయించాలి అనేదే వారికి సవాలుగా మారిందట. అయితే వారి ఆలోచన ప్రకారం రావణాసురుడి పాత్రకు మన టాలీవుడ్ హీరో ప్రభాస్ అయితే సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బాహుబలి వంటి భారీ సినిమాలో రాజుగా నటించిన అనుభవం ప్రభాస్ కి ఉండడం, అదీకాక సరైన ఒడ్డు మరియు పొడుగు ప్రభాస్ సొంతం అవడంతో అతడినే రావణాసురుడిగా తీసుకుంటే బెటర్ అనేది వారి భావనట. 

అన్నిటికంటే ముఖ్యంగా బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేరడం, ఇక ఇటీవల సాహో సినిమా నార్త్ లో మంచి కలెక్షన్స్ సాధించడంతో ఆయననే తీసుకోవాలని నిర్ణయించారట. ఇక నేడు ఈ వార్త పలు బాలీవుడ్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఈ సినిమా నిర్మాతల నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. ఒక వేళ ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ప్రభాస్ కు తన అసలు సిసలైన టాలెంట్ ని రావణుడి పాత్ర ద్వారా చూపించే అవకాశం దొరికినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: