మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న " సైరా నరసింహారెడ్డి" సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2 న  ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో కూడా సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ప్రీ-రిలీజ్ ఇవెంట్  22 ఆదివారం కు వాయిదా పడింది. ఈ నెల 18 న సాయంత్రం 5:31కి ట్రైలర్ లాంచ్ అవుతుంది.


ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి 152 సినిమాని  కొరటాల శివ  దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన స్ర్కీప్ట్ పనులు ప్రీ-ప్రొడక్షన్ పనులు అన్ని దాదాపు పూర్తయ్యాయి. సైరా నరసింహారెడ్డి విడుదల తరువాత ఒక నెల రెస్ట్ తీసుకొని నవంబర్ 3న ప్రారంభోత్సవం జరుపుకోనుందని తెలుస్తోంది. నవంబర్ రెండవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. ఈ సినిమాకి హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నాయనతార, కాజల్ అగర్వాల్, ఇలియానా చాలా పేర్లు తెర పైకి వచ్చాయి కానీ ఎవరు ఫిక్స్ కాలేదు.. ఈ సినిమా ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 


ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒక ముఖ్యమైన పాత్రలో   నటిస్తుందని వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు. విజయశాంతి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సరిలేరు నీకెవ్వరు" సినిమా ద్వారా మళ్లీ సినిమాల్లో కి రీ ఎంట్రీ  ఇస్తున్నారు. చిరు మరియు విజయశాంతి కలిసి దాదాపు 19 సినిమాల్లో నటించారు. అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాని మార్చి, 25 2020 ఉగాది న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: