ఈరోజు జరగవలసిన ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడటంతో అసంతృప్తికి గురి అయిన మెగా అభిమానులకు జోష్ ను ఇవ్వడానికి ఈరోజు సాయంత్రం ‘సైరా’ ట్రైలర్ ను చాల విభిన్నంగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ తో సహా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక పట్టణాలలో ధియేటర్లను ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు బ్లాక్ చేసి ఆ ధియేటర్లలో మెగా అభిమానులకు ఉచితంగా ‘సైరా’ ట్రైలర్ ను చూపెట్టబోతున్నారు. 

దీనితో ఈరోజు సాయంత్రం మన తెలుగు రాష్ట్రాలలో అనేక ధియేటర్ల వద్ద ‘సైరా’ విడుదల కాకుండానే సందడి మొదలు కాబోతోంది. ‘సాహో’ విడుదలకు ముందు కూడ ఇలాంటి పద్ధతిని అనుసరించి ఆ మూవీ ట్రైలర్ ను ధియేటర్లలో కేవలం ప్రభాస్ అభిమానుల కోసం చూపించడంతో ఆ మూవీ పై విపరీతమైన అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు అదే పద్ధతిని ‘సైరా’ టీమ్ అనుసరిస్తోంది. దీనితో ఈరోజు సాయంత్రం ధియేటర్లలో హంగామా చేయడానికి మెగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 22న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన వార్తలు కూడ మెగా అభిమానులకు జోష్ ను ఇచ్చే విధంగా లీక్ చేస్తున్నారు. 

చిరంజీవి పవన్ కళ్యాణ్ లు చాలకాలం తరువాత ఒకే వేదిక పై కనిపించే సందర్భం కాబట్టి ఈ ఈవెంట్ కు అత్యధిక స్థాయిలో మెగా అభిమానులను తీసుకు రావడానికి దూర ప్రాంతాల నుండి రవాణా సదుపాయాలు కూడ ఉచితంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మెగా స్టామినాకు చిహ్నంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ తరువాత ఎక్కడ చూసినా ‘సైరా’ మ్యానియా కనిపించేలా చరణ్ భారీ ప్రణాళికలు ఇప్పుడు ఇండస్ట్రీకి హాట్ టాపిక్ గా మారాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: