ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్నా ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5:31గంటలకు అన్ని భాషల్లో విడుదలకానుంది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో రానున్న ఈ ట్రైలర్ సినిమా ఫై అంచనాలను మరింతగా పెంచడం ఖాయంగా కనిపిస్తుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. లెజెండరీ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి , రవి కిషన్ ,సుధీప్, తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంఫై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో విడుదలకానుంది. కాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 22న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో గ్రాండ్ గా జరుగనుంది.