గీతగోవిందం’ భారీ సక్సస్ తరువాత దర్శకుడు పరుశు రామ్ కు ఎన్ని అవకాశాలు వచ్చినా టాప్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు. మహేష్ ను మెప్పించడం కోసం అనేక కథలు కూడ వినిపించాడు. 

అయితే సంవత్సర కాలం గడిచిపోయినా మహేష్ నుండి స్పందన రాకపోవడంతో వాస్తవ దృష్టిలోకి వచ్చిన పరుశు రామ్ నాగార్జున రాయబారాలకు స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. నాగ్ చిన్నకొడుకు అఖిల్ కోసం పరుశు రామ్ ఒక టోటల్ కామెడీ లవ్ స్టోరీని పూర్తి చేయడంతో ఈమూవీకి నాగార్జున లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. బయటపడిన వార్తల ప్రకారం ఈమూవీ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. 

ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖ నటులు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కాబోతున్నారు. సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకులు ఎవరు అఖిల్ వైపు చూడటానికి ఇష్టపడని పరిస్థితులలో మరో మార్గం లేక పరుశు రామ్ అఖిల్ తో సద్దుబాటు చేసుకోవలసి వస్తోంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి అని తెలుస్తోంది. 

వరుస పరాజయాలతో సతమతమైపోతున్న అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ మూవీలో నటిస్తూ మరొకవైపు పరుశు రామ్ మూవీని కూడ క్లియర్ చేసుకోవడంతో వారసత్వ హీరోలకు వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా తిరిగి రివైవ్ కావడానికి ఎలా అవకాశాలు వస్తాయో అన్న విషయం అర్ధం అవుతుంది. పరుశు రామ్ కోరిక టాప్ హీరోల పై ఉంటే ఎలాంటి మార్గం లేక పరిస్థితులతో రాజీపడి అఖిల్ తో సినిమాను చేస్తున్న పరిస్థుతులలో ఈమూవీని కూడ పరుశు రామ్ హిట్ చేయగలిగితే ఖచ్చితంగా టాప్ హీరోలు అంతా ఇతడి వెంటపడతారు అనడంలో ఎటువంటి సందేహంలేదు..   


మరింత సమాచారం తెలుసుకోండి: