మంగళవారం జరిగిన ఎపిసోడ్ తో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. కంటెస్టెంట్స్ అందరూ తమకు నచ్చిన వారికోసం త్యాగాలు చేసి వారిని నామినేషన్స్ నుండి తప్పించారు. అయితే అనుకోకుండా హిమజ నామినేట్ అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత వరుణ్ పునర్నవికి షాక్ ఇచ్చాడు. వరుణ్ పేడ తొట్టిలో పడుకోవడం వితికాకి ఇష్టం లేదు. హిమజ కోసమే కాదు ఎవరికోసమైనా వరుణ్ అలా చేయడం ఆమెకి ఇష్టం లేదని చెప్పింది.


ఈ విషయమే వితికాతో మాట్లాడుతుంటే వరుణ్ తనని తాను సమర్థించుకుంటూ నాకోసం ఒకరు పర్మినెంట్ టాటూ వేసుకున్నపుడు పేడ తొట్టిలో పడుకోవడం అనేది చాలా చిన్న విషయమని  అందుకే చేశానని చెప్తాడు. దానికి పక్కనే ఉన్న పునర్నవి ఎవరికోసం చేశావనేది కూడా ఇంపార్టెంటే అవుతుంది కదా అంటుంది. పునర్నవి అలా అనడంతో  సీరియస్ అయిన వరుణ్, ఎవరికోసం అనేది ఇంపార్టెంట్ కానే కాదు. నాకోసం టాటూ వేసుకున్నపుడు నేను కూడా ఏదో ఒకటి చేయాలి.


ఈ డిస్కషన్ లో మాటా మాటా పెరిగి ఇద్దరూ అరుచుకున్నారు. నీకు ఆటిట్యూడ్ ఉందని ఇంట్లో అందరికీ తెలుసు అంటాడు. మొదటిసారిగా వరుణ్ ఈ విషయం గురించి ప్రస్తావించాడు. ఇంకా ఆమె మీద రెచ్చిపోతూ "అయినా చేసింది నేను కదా నీకెందుకు అంత బాధ? అని పునర్నవిని అనేసరికి ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నీ ఆటిట్యూడ్ గురించి ఇంట్లో అందరికీ తెలుసు. కావాలంటే ఫుటేజీ చూసుకో అనడంతో పునర్నవి షాక్ కి గురైంది.


పోయిన వారంలో పునర్నవి బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ చేయనని చెప్పినపుడు ఆమెని సముదాయించి ఒప్పించిన వరుణ్ ఇలా విరుచుకుపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గొడవ, ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: