ఇండ‌స్ట్రీలో హీరో హీరోయిన్లు ఎంత బిజీగా ఉంటార‌న్నది మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌కోవ‌ల్సిన ప‌నిలేదు. ఎప్పుడూ షూటింగ్స్ బిజీ బిజీ లైఫ్‌ని గ‌డుపుతుంటారు. అలాంటివారు ఎప్పుడైన కాస్త స‌మ‌యం దొరికితే చాలు ఎటైన  విహార‌యాత్ర‌ల‌కు వెళ్ళిపోయి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. మ‌రి ఇప్పుడు మ‌న చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆగ్రాలోని తాజ్ మహల్ ను చూడ‌డానికి వెళ్లింద‌ట‌. అయితే తాను ఇది తొలిసారిగా ఇప్పుడే చూశానని అంటోంది ఈ భామ‌. 'తండ్రితో కలసి ఈ చారిత్రక సౌందర్యాన్ని వీక్షించానని, ఆ అందాన్ని చూసి మాటలు రాలేదని సోషల్ మీడియాలో కాజల్ పోస్ట్ పెట్టింది.  సందర్భంగా తాజ్ మహల్ ముందు నిలబడి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.  టెక్నాల‌జీ పెరిగిన త‌ర్వాత ఈ మ‌ధ్య ఎవ‌రు ఎక్క‌డ ఉంటున్నారు ఎక్క‌డ ఎంజాయ్ చేస్తున్నారు అన్న ప్ర‌తి విష‌యాన్ని వాళ్ల వాళ్ళ సంబంధిత సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇదొక ఫ్యాష‌న్ అయిపోయింది. 


కాజల్ అగర్వాల్..  దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్‌కు పరిచయమైనా.. కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. అయితే కేరిర్ మొదట్లో  గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత ఇండస్ట్రీలో కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ సొంత అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో వానవిల్లులా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా... చూపులతోనే చంపేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: