‘సాహో’ నిర్మాణంలో ఉన్నప్పుడే ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో జిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో ఒక మూవీని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ‘సాహో’ ఫలితం వచ్చిన తరువాత ఈ మూవీని పూర్తిగా క్యాన్సిల్ చేద్దామని ప్రభాస్ భావించినట్లు తెలుస్తోంది. 

అయితే కృష్ణంరాజు ఒత్తిడితో ఈ మూవీ నిర్మాణం తిరిగి నవంబర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ఈ మూవీకి సంబంధించిన కథలో పూర్తి మార్పులు చేయడమే కాకుండా ఈ మూవీ హిందీ వెర్షన్ ఒకలా తెలుగు వెర్షన్ ఒకలా తీసే మార్పులు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కామెడీ ట్రాక్ ను స్పెషల్ గా పెడుతున్నట్లు సమాచారం. 

అయితే హిందీ వెర్షన్ లో మాత్రం ఈ కామెడీ ట్రాక్ లేకుండా కేవలం ప్యూర్ లవ్ స్టోరీని హైలెట్ చేస్తారని తెలుస్తోంది. అందువల్ల ఈ మూవీని రెండు సార్లు బాలీవుడ్ కోసం ఒకలా టాలీవుడ్ కోసం ఒకలా తీయబోతున్నట్లు టాక్. 1980 కాలంనాటి యూరప్ నేపధ్యంలో సాగే ప్రేమకథ కావడంతో ఈ మూవీ నిర్మాణ విషయంలో ఖంగారు పడకుండా నెమ్మదిగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. 

ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ప్రస్తుతం చాల బిజీగా ఉన్న పరిస్థితులలో ఆమె డేట్స్ ను బట్టి ప్రభాస్ తన డేట్స్ ను సద్దుబాటు చేసుకుంటానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను పూర్తిగా ఆపేయాలని ప్రభాస్ భావించినా కృష్ణంరాజు ఒత్తిడితో ఈ మూవీని ప్రభాస్ పూర్తి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను చేస్తూనే ప్రభాస్ ఒక మాస్ సినిమాను తనతో తీయగల దర్శకుడు కోసం చేసే అన్వేషణ కొనసాగుతుందని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: