మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా" నరసింహారెడ్డి మరి కొద్ది రోజుల్లొ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ని మొదలు పెట్టనుంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కి విశేష స్పందన లభించింది.  తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లో విడుదలవుతున్న ఇ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.


ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి భారీ కసరత్తులు చేస్తున్నారు. బాహుబలి సినిమాని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాని బాలీవుడ్ లో విడుదల చేస్తున్నామై మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే చెప్పారు. అయితే ఈ సినిమా టీజర్ ఫంక్షన్ లో సినిమాలో నటించిన వాళ్ళందరూ కనిపించారు. తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, రవికిషన్ లాంటి వాళ్లందరూ ప్రమోట్ చేయడానికి వచ్చారు.


కానీ సైరా సినిమాలో చిరంజీవికి జోడీగా నటించిన నయనతార మాత్రం రాలేదు. నయనతార సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా కనిపించదు. సినిమా చేసేంత వరకు మాత్రమే ఆమె ఉంటుంది. ఆ తర్వాత ఏ ఫంక్షన్ లో కూడా ఆమె కనబడదు. కానీ సైరా భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రం కోసమైనా ఆమె ప్రమోషన్లలో పాల్గొంటే బాగుంటుందని అంటున్నారు. 


బాలక్రిష్ణ, నయనతార జంటగా నటించిన శ్రీరామరాజ్యం సినిమాకి ఆడియో ఫంక్షన్ కి ఆమె హాజరయ్యింది. అలాగే సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సినిమాలే కాదు. వాటికి ప్రమోషన్ చేయడం కూడా ముఖ్యమే. ఈ విషయాన్ని ఆమె గుర్తుంచుకుని ప్రమోషన్లలో పాల్గొంటుందేమో అని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: