మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మొదట కర్నూలు ప్రాంతంలో చేద్దామని భావించినా అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాదులో చేద్దామనే ఆలోచన లో రిలీజ్ వేడుకను వాయిదా వేశారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు అని మెగా అభిమానులు నిరుత్సాహంగా ఉన్న క్రమంలో తాజాగా ఈ వేడుక వాయిదా పడటంతో మరింత నిరుత్సాహానికి గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదల కాబోతున్న క్రమం ట్రైలర్ మాత్రం అనుకున్న టయానికి విడుదల చేస్తున్నారు.


అనగా ఈరోజు సాయంత్రం 5:30 కి సైరా ట్రైలర్ విడుదల కానుంది. కాగా ఇదే రోజు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున చేయాలని సైరా సినిమా యూనిట్ భావించగా కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ 22వ తేదీకి వాయిదా వేసింది. రిలీజ్ చేయబోయే ట్రైలర్ తో సినిమా యూనిట్ ఒక బజ్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాంచ్ ను యుట్యూబ్ తో పాటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేయనున్నారు.


ఇలా థియేటర్లలో విడుదల చేస్తుండడంతో అభిమానులు ఇప్పటికే సాయంత్రం సంబరాలకు సిద్ధమయ్యారు.బాహుబలి ట్రైలర్ ని కూడా ఇలానే థియేటర్లలో విడుదల చేశారు. కాకపోతే ఇప్పుడు సైరా ట్రైలర్ అంత భారీ స్థాయిలో మాత్రం కాదు. బాహుబలి ట్రైలర్ ఇలా థియేటర్లలో విడుదల చేయడం వల్ల సినిమాకు బాగానే కలిసివచ్చింది. ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సైరా కూడా అదే ఫార్ములాతో ముందుకు దూసుకుపోతుంది. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. తెలుగులో పాటు మరియు ఇతర భాషల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: