అక్కినేని కుటుంబం నుండి సిల్వర్ స్క్రీన్ పై వారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అఖిల్ ఇద్దరిలో నాగ చైతన్య దూసుకుపోతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ అక్కినేని కుటుంబం పేరు నిలబెడుతూ అద్భుతమైన స్టోరీలను పెంచుకుంటూ అక్కినేని అభిమానులను అలరిస్తున్నాడు. అయితే మరోపక్క అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. సినిమా విజయం కోసం ఎన్ని ఫీట్లు చేసిన డాన్స్ ఎంత బాగా చేసినా అఖిల్ కి మాత్రం విజయం దక్కడం లేదు. ఆఖరికి కింగ్ నాగార్జున అఖిల్ కెరీర్ విషయంలో ఇన్వాల్వ్ అయినా రిజల్ట్ మాత్రం మారడం లేదు. ఇటువంటి క్రమంలో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.


అది కూడా ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో అని సమాచారం. విషయంలోకి వెళితే అజయ్ భూపతి మహాసముద్రం అనే టైటిల్ పేరిట సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంత కాలం నుండి ఇండస్ట్రీలో వినబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు రవితేజ నటిస్తున్నట్లు ఇంకా చాలామంది పేర్లు బయటకు వచ్చాయి కానీ ఎవరిది కూడా ఫైనల్ కాలేదు.


కాగా తాజాగా ఈ సినిమాలో అక్కినేని అఖిల్ మరియు నాగ చైతన్య ఇద్దరు కలిసి నటిస్తున్నట్లు సమాచారం. అధికారికంగా ఈ వార్త ఇంకా బయటకు రాకపోయినా కానీ వీరిద్దరు కలిసి నటించడం కన్ఫర్మ్ అని చాలామంది ఇండస్ట్రీ లో ఉన్నవారు కామెంట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతా ని కూడా తిసుకోబోతున్నారనే టాక్ కూడా వినబడుతోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే కచ్చితంగా డైరెక్టర్ అజయ్ భూపతి నోరు విప్పాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: