మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా పై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి అనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కడం జరిగింది. ఇక నేటి సాయంత్రం రిలీజ్ కానున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ లో మంచి హోప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మెగాస్టార్ పలికే డైలాగ్స్, అద్భుతమైన విజువల్స్, యాక్షన్ మరియు యుద్ధ సన్నివేశాలు సూపర్బ్ గా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, కొద్దిరోజులుగా డబ్బింగ్ తదితర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 

అయితే నేటితో అవన్నీ ముగిసినట్లు సమాచారం. అంతేకాక మరొక రెండు రోజుల్లో ఫుల్ కాపీ సిద్ధం అవుతుందని, ఆ వెంటనే సినిమాను సెన్సార్ కు పంపుతారని అంటున్నారు. ఒకరకంగా నేటితో సైరా సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తి అయిపోయినట్లే అని తెలుస్తోంది. మెగాస్టార్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ నటుడు సుదీప్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, 

తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, దాదాపుగా రూ.250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి నేడు హైదరాబాద్ లో ఘనంగా జరుగవలసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, వాతావరణం సరిగా లేని కారణంగా ఈనెల 22కి వాయిదా పడింది. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: