లోక  నాయకుడు కమల్ హాసన్ , కోలీవుడ్  స్టార్  డైరెక్టర్  శంకర్ కలయికలో  తెరకెక్కతున్నచిత్రం  'ఇండియన్ 2'.  ఈసినిమా ప్రాంభమైనప్పటినుండి  షూటింగ్ కు ఏదో రకంగా అడ్డంకి  ఏర్పడుతూనే వచ్చింది  దాంతో ఈచిత్రం  ఆగిపోయిందని వార్తలు  వచ్చాయి. అయితే  ఇటీవల ఆ వార్తలకు చెక్ పెడుతూ  మళ్ళీ సినిమా షూటింగ్  స్టార్ట్ చేసింది  చిత్ర యూనిట్. కొద్దీ రోజుల క్రితం  చెన్నై లో  జరిగిన షెడ్యూల్ లో  రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ , సిద్దార్థ్ లపై ముఖ్య సన్నివేశాలను  తెరకెక్కించగా  తాజాగా ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూలకొత్త షెడ్యూల్  నిన్న రాజమండ్రి లో ప్రారంభమైంది.  ఈ షెడ్యూల్ లో కమల్ హాసన్  పాల్గొంటున్నారు. సుమారు  20రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత  కడప  జిల్లాలో  షూటింగ్ ను కొనసాగించనున్నారు. 




భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  యంగ్ మ్యూజిక్  సెన్సేషన్  అనిరుధ్ రవిచంద్రన్  సంగీతం అందిస్తుండగా   కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.  కాగా బాలీవుడ్  నటుడు విద్యుత్ జంవాళ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.   ఇక ఈ చిత్రం సాలిడ్ మెసేజ్ తో  సున్నితమైన అంశాలను  ప్రస్తావిస్తూ  తెరకెక్కుతుందట.  1996లో వచ్చిన సూపర్  హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా తెరెకెక్కుతున్న ఈ ఇండియన్ 2 ఫై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఇక ఇదిలావుంటే ఇక కమల్ హాసన్ కు ఇదే చివరి సినిమా  అయ్యే అవకాశాలు వున్నాయి. ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టిన  కమల్  ఈ సినిమా తరువాత రాజకీయాల్లో బిజీ కానున్నాడని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: