ఒక్క హిందీలోనే ఈచిత్రం 153కోట్ల వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకోగా మిగితా భాషల్లో డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 125కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా కేవలం 80కోట్ల వసూళ్లను మాత్రామే రాబట్టింది. తమిళనాడు , కేరళ , కర్ణాటక కలుపుకొని 22 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 42కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 28కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అయితే ఓ కోణంలో చూస్తే ఇంత నెగిటివ్ టాక్ లో కూడా సాహో ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టడం గొప్ప విషయమే. ఒకవేళ సినిమా కు కనుక హిట్ టాక్ వస్తే కలెక్షన్ల విషయంలో బాహుబలి తరువాతి స్థానంలో నిలిచేదే. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని 370కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఇక ఈ రికార్డులను మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా బ్రేక్ చేసి ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా అవతరిస్తుందో లేదో చూడాలి. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.