మెగా బ్రదర్స్‌ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో కచ్చితంగా సినిమా తీస్తానని అప్పట్లో పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, సినీనిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాను మాటల మాంత్రీకుడు త్రివిక్రం రచన దర్శకత్వం వహిస్తారని కూడా ఒక వార్త వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉండటంతో ఇద్దరూ టీఎస్సార్‌కు డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో మెగా బ్రదర్స్ తో సినిమా తీయాలన్న ఆయన కోరిక తీరలేదు. అంతేకాదు.. ఇప్పట్లో సినిమా ఉండదనే అందరూ భావించారు. కాని తాజాగా మరోసారి మెగాబ్రదర్స్‌‌తో సినిమాపై టీఎస్సార్ మంచి క్లారిటి ఇచ్చారు. 

ఇటీవల మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన టీఎస్సార్‌కు మీడియా మిత్రుల నుంచి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదరువగా.. ఆయన చాలా లాజిక్‌గా బదులిచ్చిన సమాధానాలు మెగా ఫ్యాన్స్ కి బోలెడంత ఉత్సాహాన్నిచ్చాయి.. ఈ క్రమంలో చిరంజీవి-పవన్‌ తో సినిమా ఎప్పుడు పట్టాలెక్కిస్తారు..? అని అడగ్గా.. అప్పట్లో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో సినిమా చేయడం కుదరలేదని అయితే ఇప్పుడు చిరు రెడీగా ఉన్నానని ఒక్కమాట చెబితే చాలు సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టంగా సమాధానం చెప్పారు. ఈ సమాధానంతో మెగా ఫ్యాన్స్‌ ఎగిరి గంతేస్తున్నారు.

అంతేకాదు నేను సినిమాలతో డబ్బులు సంపాదించనని.. బిజినెస్‌లో మాత్రమే సంపాదిస్తానని చెప్పారు. సినిమాలు తీసి సంపాదించే నిర్మాతలు చాలా తక్కువమంది ఉన్నారని.. నిర్మాతలకు డబ్బులు రావని టీఎస్సార్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి.. సహా నేటితరం హీరోలతోనూ ఆయన ఎంతో సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒకవేళ అన్ని కుదిరి టీఎస్సార్‌ గనక మెగాస్టార్-పవర్ స్టార్ లతో సినిమా నిర్మిస్తే మాత్రం భారీ ప్రాజెక్ట్ అవడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: