దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు భాగాలను ఎంతటి అత్యద్భుత విజయాలుగా మలిచారనేది మనకు అందరికీ తెలిసిందే. ఒక భాగాన్ని మించి మరొక భాగం ఎంతో గొప్ప విజయాలు మరియు కలెక్షన్స్ అందుకోవడంతో పాటు, మన తెలుగు సినిమా ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింప చేసాయి. ఇకపోతే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న రాజమౌళి, ఈ సినిమాలో చరణ్ ను అల్లూరి గాను, అలానే ఎన్టీఆర్ ను కొమరం భీం గాను చూపించనున్నారు. 

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దాదాపుగా రూ.450 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్  బల్గెరియాలో జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మొదలు కానప్పటికీ, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఆర్ఆర్ఆర్ సినిమాకు నైజాం హక్కుల కోసం ఒక బడా నిర్మాత ఏకంగా రూ.80 కోట్లవరకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడని అంటున్నారు. 

గతంలో పలు బడా టాలీవుడ్ సినిమాలను నైజాంలో రిలీజ్ చేసిన ఆ నిర్మాత, ఈ ఆర్ఆర్ఆర్ హక్కుల కోసం ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1 సినిమా రూ.42.7 కోట్లు, అలానే బాహుబలి 2 సినిమా రూ.66 కోట్ల కలెక్షన్ ఒక్క నైజాం ఏరియాలోని రాబట్టడంతో, ఈ సినిమా అంతకు మించి రాబట్టడం ఖాయం అని భావించిన ఆ నిర్మాత, అంతటి భారీ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధమయినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయమై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ నేడు మాత్రం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో వాస్తవాలు వెల్లడైనతేనే కానీ నమ్మలేం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: