కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' సినిమాని తెలుగులో 'ఓ బేబీ'గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ బాబు ఓ బేబీ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నందిని రెడ్డితో మరో సినిమాను నిర్మించాలని రానా నిర్ణయించుకున్నారు. అందుకోసం మళ్ళీ కూడా కొరియన్ మూవీనే ఎంచుకోవడం విశేషం. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఒక కొరియన్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు రానా సిద్దం అయిన విషయం తెల్సిందే. ఆ రీమేక్ లో రానా పక్కన హీరోయిన్ గా కీర్తి సురేష్ ను నటింపచేయడానికి సంప్రదించగా కీర్తి ఎందుకనో నిర్మొహమాటంగా నో చెప్పేసింది. గత రెండు రోజులుగా ఈ విషయం బాగా వైరల్ కూడా అయిన సంగతి తెలిసిందే.  

కీర్తి సురేష్ ప్రస్తుతం హిందీలో మైదాన్, తెలుగులో మిస్ ఇండియా సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలకు కమిటవడంతో రానా సినిమాకు కీర్తి సురేష్ నో చెప్పింది. దాంతో కీర్తి స్థానంలో కాజల్ ను ఎంపిక చేసేందుకు రానా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తెలుగు తో పాటు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న కాజల్ అయితే ఈ రీమేక్ కు న్యాయం చేస్తుందని నందిని రెడ్డి, కాజల్ ఒక నిర్ణయానికి వచ్చారని అందుకే ఆమెతో చర్చలు జరుపతున్నట్లుగా సినీ వర్గాల సమాచారం. 

ప్రస్తుతం కాజల్ కు తెలుగులో అంతగా అవకాశాలు లేవు. తమిళంలో ఇండియన్ 2 తో పాటు హిందీలో ఒక సినిమాని మాత్రమే చేస్తోంది. అందుకే కాజల్ ఖచ్చితంగా ఈ రీమేక్ కు ఒప్పుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఇక పవర్ ఫుల్ రోల్ లో కాజల్ ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. అంతా ఓకే అయితే రానాతో గతంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించిన కాజల్ ఇప్పుడు రానా నిర్మాణంలో లేడీ ఓరియంటెడ్ సినిమాను నందిని రెడ్డి దర్శకత్వంలో చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. ఇక కాజల్ నిర్మాతగా కూడా చిన్న బడ్జెట్ సినిమాలను రూపొందించాలనే ప్రయత్నాలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: