కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన రష్మిక మందన్న తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో చేసింది నాలుగు సినిమాలే అయినా అమ్మడికి లక్ అలా కలిసి వచ్చింది. చేసిన నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు విజయ్ దేవరకొండతో చేయడం వల్ల మరింత పాపులారిటీ వచ్చింది. నాగ శౌర్యతో ఛలో హిట్ అవడంతోనే గీతా గోవిందంలో విజయ్ సరసన ఛాన్స్ రాబట్టింది.


ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్లింది. ఆ తర్వాత దేవదాస్ సినిమా చేసినా ఆ సినిమా ఫలితం అమ్మడి కెరియర్ మీద ఎఫెక్ట్ చూపించలేదు. ఇక రీసెంట్ గా విజయ్ తో నటించిన డియర్ కామ్రేడ్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ అవలేదు. ప్రస్తుతం రష్మిక సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది.  


ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో బన్ని సినిమా అంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ గా త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక పల్లెటూరి పిల్లగా కనిపిస్తుందట. 


ఇప్పటివరకు రష్మిక తెలుగులో చేసిన సినిమాలన్నిటిలో మోడ్రెన్ లుక్ తోనే కనిపించింది. కెరియర్ లో మొదటిసారి రష్మిక విలేజ్ గాళ్ లుక్ తో కనిపించనుంది. ఆల్రెడీ దీనికి సంబందించిన ఫోటో షూట్స్ పూర్తయ్యాయట. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అవగానే సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. మొత్తానికి సుకుమార్ రష్మిక మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: