డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలయింది. దేశ స్వాతంత్రం కోసం తొలిసారి పోరాడిన తెలుగు స్వాతంత్ర పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని ఇటీవల విడుదలైన ట్రైలర్ బట్టి తెలుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఇక్కడ విశేషమేమిటంటే విడుదలైన ట్రైలర్ లో మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక కనిపించడం. కాగా చిన్ననాటినుండి నిహారికా కి పెదనాన్న చిరంజీవిగారితో కలిసి పని చెయ్యాలనే కోరిక ఎప్పటి నుండో ఉండేదట ఇటువంటి అవకాశం కోసం చిన్ననాటి నుండి ఎదురుచూస్తూ ఉందట. దీంతో చాలా కాలం తర్వాత సైరా సినిమాలో చిరంజీవితో నటించడంతో తన కల నెరవేరిందని ఇటీవల నిహారిక చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా నిర్మాత రామ్ చరణ్ వల్ల నిహారిక కల నెరవేరినట్లు ఫిలిం నగర్ టాక్. సినిమాలో మన్యం కి చెందిన పిల్లగా నిహారిక కనిపించనుంది.
అంతేకాకుండా పోరాట సన్నివేశాలలో కూడా నటించినట్లు ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ బట్టి తెలుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే చాలా పవర్ ఫుల్ పాత్రలో నిహారిక నటించినట్లు తెలుస్తుంది. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. అంతే కాకుండా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.