'సైరా నరసింహారెడ్డి'..ఇప్పుడు సినిమా ప్రేక్షకులు.అభిమానులు ఆసక్తితో ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం.ఇందులో చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఈ చిత్రం బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది.ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రాంచరణ్ నిర్మించిన సైరా మూవీ ట్రైలర్ నిన్న విడుదలై విశేష స్పందన దక్కించుకుంది.దాదాపు రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ లో వీరోచిత పోరాటాలు,అబ్బురపరిచే విజువల్స్ తో ఆసక్తికరంగా సాగింది.కాగా ఈ మూవీలో ఫిమేల్ లీడ్ పాత్రలు చేసిన నయనతార,తమన్నాలకు ఈ చిత్రంలో అధికప్రాధాన్యం ఉంటుందని ట్రైలర్ ను చూస్తే అర్ధం అవుతుందని చెప్పొచ్చు.



ముఖ్యంగా తమన్నా పాత్ర ఆసక్తిని రేపుతుంది.‘లక్ష్మీ అనే నాపేరుముందు నరసింహ అనే మీ పేరు ఇవ్వండి చాలు’అని అడగడం చూస్తే సమాజానికి తెలియని నరసింహారెడ్డి భార్యగా లేదా ఆయన భార్య కావాలని తపించే యువతిగా తమన్నా పాత్ర ఉంటుందనిపిస్తుందట.ఇక బాహుబలి తరువాత సైరా లో మరో మారు కీలకపాత్ర దక్కించుకున్న తమన్నా అటు ఎమోషన్స్ తోపాటు ఇటు వీరోచిత సన్నివేశాలలో కూడా అలరిస్తారనిపిస్తుంది.ఇక సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్,అమితాబ్ బచ్చన్,జగపతిబాబు,విజయ్‌సేతుపతి వంటి స్టార్లు ముఖ్య పాత్రలో నటిస్తుండగా,నయనతార కథానాయికగా తన అందచందాలతో కట్టిపడేయనుందట.



భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం,కన్నడ,హిందీ,మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు..ఇక దసరాకు నాలుగురోజుల ముందు రీలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ కలెక్షన్లు సృష్టించే అవకాశం వుందంటున్నారు ఎందుకంటే వరసగా దసరా సెలవులు రావడం.ఇప్పటికే ఈ చిత్రం పై భారీగా అంచనాలు పెరిగిపోవడం ఇవన్ని కూడ కలసివస్తున్నాయి.ఇక చిరు అభిమానుల్లో దసరాతో పాటు ఈ మూవీ కూడ అంతకంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందను కుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: