ప్రముఖ  టివి రియాల్టీ షో  బిగ్ బాస్ తెలుగు సీజన్ 3  ప్రస్తుతం  సగానికి పైగా  కంప్లీట్ అయ్యింది.  ఈసీజన్ లో మొదటి సారి కపుల్ ను  కంటెస్టెంట్ లుగా  హౌజ్ లోకి ప్రవేశపెట్టారు. వారు ఎవరంటే యంగ్ హీరో వరుణ్ సందేశ్ , వితిక.   అయితే షో ప్రారంభం లో  ఈజంటపై పెద్దగా  హైప్ క్రియేట్ కాలేదు.   కానీ ఆతరువాత  వరుణ్.. అతని  సత్ప్రవర్తన  తో ప్రేక్షకుల మనసు గెలుచుకొని  ప్రస్తుతం హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు.   అంతేకాదు ఈ సీజన్ ఫైనల్ లో  కూడా వరుణ్ ఉంటాడని  బిగ్ బాస్ ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.  ఇక వితిక విషయానికి వస్తే వరుణ్ వల్ల  వితిక సేవ్ అవ్వుకుంటూ వస్తుంది తప్ప పెద్దగా  తన  ట్యాలెంట్ ను చూపించడం లేదు. వరుణ్ లేకుంటే  మాత్రం వితిక  ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేదే.  టాస్క్ లోకూడా  వితిక మిగితా వారికి పోటీ నివ్వకపోయిన ఎలిమినేషన్ నుండి మాత్రం ఇప్పటివరకు సేవ్ అవుతూ వచ్చింది. 




ఇక ఈ జంట ఈ సీజన్ మొత్తానికి కలిపి  పారితోషికం కింద 28లక్షలు తీసుకుంటుంటున్నారట.  ఓ రకంగా చెప్పాలంటే ఇది వీరికి పెద్ద అమౌంటే. ఎందుకంటే  వరుణ్ హీరో గా ఫామ్ కోల్పోయి కొన్ని ఏళ్ళు అయ్యింది. బిగ్ బాస్ కు రాకముందు  వితిక  ఎవరో పెద్దగా తెలియదు. దాంతో  బిగ్ బాస్  ద్వారా ఈ జంట భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు.  కాగా  ఈ సీజన్ కంటెస్టెంట్లలో  ప్రముఖ యాంకర్  శ్రీ ముఖి  అత్యధిక  రెమ్యునరేషన్  తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే ఇప్పటికి వరుకు ఈ సీజన్ లో 7 ఎలిమినేషన్లు జరుగగా  ప్రస్తుతం  హౌజ్ లో వితిక , వరుణ్ సందేశ్ , మహేష్ ,రాహుల్ , శ్రీ ముఖి , బాబా భాస్కర్ , హిమజ , శివ జ్యోతి , పునర్నవి , రవి కృష్ణ   కంటెస్టెంట్లు  గా కొనసాగుతున్నారు.  మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: