తెలుగు సినీ పరిశ్రమతో సహా మిగిలిన సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. అన్ని ఇండస్ట్రీ దర్శకులు ఆయా ప్రాంతాల్లోని పెద్ద వాళ్ళ బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ బయిపిక్స్ వచ్చాయి. కానీ, అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. అయితే, ప్రస్తుతం తమిళ్లో అమ్మ జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో ప్రముఖ యాక్టర్స్ నటిస్తున్నారు.ఇకపోతే హిందీలో ఒక పైలెట్ చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటిస్తుంది. 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో మరో బయోపిక్ తెరక్కబోతుంది. చిరంజీవి జీవితకథ ఆధారంగా బయోపిక్ రానుంది. ఆ బయోపిక్ లో మెగా వారసులే నటిస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. అయితే, అందుకోసం మెగా బ్రదర్ తనయుడు వరుణ్ బాబు నేను తప్ప ఎవరిని హీరోగా పెట్టిన కూడా నేను ఊరుకోను. ఆ సినిమాలో నేను చిరంజీవిగా కనిపించడానీకోసం నేను ఎంత కష్టమైన భరిస్తాను అని అయన వెల్లడించారు. 

ఆ సినిమాను హరీష్ శంకర్ దర్శత్వం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. శంకర్ ఆ ఆలోచనకు పదును ఎప్పుడు పెడతాడో చూడాలి . నిజానికి ఆ సినిమాలో చేయడానికి అన్ని అర్హతలు చరణ్ కు ఉన్నాయని అంటున్నారు. అన్న సినిమాలలో బిజీగా ఉండి ఆ సినిమాలో చేయలేనని అంటే నేను పక్క చేస్తాను అని వరుణ్ బాబు వెల్లడించారు. 

ప్రస్తుతం వాల్మీకి సినిమాలో బిజీగా ఉన్న వరుణ్.. ఈ సినిమా తరువాత ఎఫ్ 2 సినిమా సీక్వెల్ గా వస్తున్నా ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు. ఆ రెండు సినిమాలు అయ్యాక చిరు బయోపిక్ లో నటిస్తారని
వార్తలు వినపడుతున్నాయి. ఇకపోతే వాల్మీకి సినిమా రేపు థియేటర్లలో సందడి చేయబోతోందని టాలీవుడ్ లో సందడి చేయబోతుంది. ఆ సినిమాలో విలన్ గా చేయబోతున్న వరుణ్ కు ఆ సినిమా ఏ రేంజులో సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: