"నీది నాది ఒకే కథ" ఒకే కథ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వేణు ఊడుగుల. శ్రీ విష్ణు హీరో నటించిన ఈ సినిమాలో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో మన ముందుకు వచ్చాడు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత వేను ఊడుగుల రానాతో సినిమా చేస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే.
రానా హీరోగా వేణు ఊడుగుల విరాటపర్వం అనే చిత్రాన్ని స్టార్ట్ చేశాడు.తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా కనిపించనుంది. సాయి పల్లవి ఫిదా సినిమాలో తెలంగాణ ప్రాంత అమ్మాయిగా చేసి ఉండడంతో ఆ పాత్రకి ఆమెని ఎంచుకున్నట్టుగా సమాచారం.
అయితే గత కొన్ని రోజులుగా రానా అందుబాటులో లేకపోవడంతో సాయిపల్లవి తో సీన్లను షూట్ చేసుకున్నారట. రానా వచ్చే వరకు షూటింగ్ ఆపేయాలని అనుకున్నారట. కానీ మళ్ళీ సాయిపల్లవి డేత్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రానా లేకుండా సాయిపల్లవి మీద వచ్చే సన్నివేశాలని చిత్రీకరించారట. మిగిలిన భాగం రానా వచ్చాక షూట్ చేస్తారట. ప్రస్తుతం రానా అమెరికాలో ఉన్నాడు.
మరో రెండు వారాలు తరువాత రానా వస్తాడట. రానా వచ్చాక సాయి పల్లవితో రానా కాంబినేషన్ లో ఉన్న సీన్లను షూట్ చేయనున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో టబు నటిస్తోంది. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.