తమిళ్ లో 2005లో వచ్చిన అయ్యా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నయనతార, ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన చంద్రముఖి సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది. ఇక ఆపై తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లక్ష్మి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నయనతార, ఇక్కడ కూడా మంచి విజయాలు అందుకున్నారు. అయితే ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న నయనతారకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది. 

ఎందుకంటే కేవలం తెలుగులోనే కాక తమిళ్ లోను పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి హిట్స్ అందుకున్న నయనతార, ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా ఒక రికార్డు నెలకొల్పినట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం ఒక తమిళ సినిమా విషయమై ఆమె ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం అప్పట్లో అక్కడి సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఇక ప్రస్తుతం ఆమె అందరికంటే అత్యధికంగా రూ.6 కోట్ల వరకు ఒక సినిమాకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాక తాను సైన్ చేసే సినిమాలకు కొన్ని షరతులు కూడా పెడతారట నయనతార. వాటన్నిటికీ ఒప్పుకుంటేనే కానీ, ఆమె ఏ సినిమాకైనా సైన్ చేయరని అంటున్నారు. ఇప్పటివరకు తెలుగు మరియు తమిళ భాషల్లో ఆమె మాదిరిగా ఇంత భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న వేరొక హీరోయిన్ లేదని అంటున్నారు. 

అయితే ఆమెకు డిమాండ్ ఎక్కువగా ఉండడం, అదీకాక అన్ని రకాల సినిమాల్లో ఆమె నటించడానికి ముందుకు వస్తుండడంతో ఆమెకు అంత మొత్తం ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇక ప్రస్తుతం తమిళ్ లో విజయ్ సరసన బిగిల్, అలానే మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న నయనతర, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్ సైరా నరసింహారెడ్డిలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఆమె అందుకుంటున్న రెమ్యునరేషన్ విషయం తెలుసుకుని పలువురు ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: