ప్రభాస్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా ఇటీవల విడుదలైంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత బాహుబలి సినిమా వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ‘సాహో’ మొదటి షోకే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు సినిమా చూసి ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు భీభత్సమైన అంచనాలు పెట్టుకోవడంతో సినిమాలో విషయం లేకపోవడంతో ‘సాహో’ సినిమా ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా గా నిలిచిపోయింది.


అయితే ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి అనేక వార్తలు వినబడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కించాలనుకునే దర్శకులకు ఓ ఆప్షన్ గా ప్రభాస్ మారిపోయాడు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.


ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో హృతిక్ రోషన్, సీతాదేవి పాత్రలో  దీపికా పదుకొనె నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రామాయణంలో అత్యంత కీలకమైన రావణాసురుడి పాత్ర కోసం ప్రభాస్ ని దర్శకుడు నితీష్ సంప్రదించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ప్రభాస్ ఓకే చెప్పాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం అనే సినిమా వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 



మరింత సమాచారం తెలుసుకోండి: