సూపర్ స్టార్ మహేష్ తో సినిమా అంటే ఏ డైరక్టర్ మాత్రం వద్దంటారు చెప్పండి. ఇక అందులో బ్యాక్ టూ బ్యాక్ మహేష్ మూవీ ఛాన్సులు వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా వచ్చిన మహర్షి సినిమాకు దర్శకుడిగా తన సత్తా చాటాడు వంశీ పైడిపల్లి. మహేష్ 25వ సినిమా ఎలా ఉండాలో అలా మహర్షిని తెరకెక్కించాడు.


ఇక ఆ సినిమా తర్వాత మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా నటిస్తున్నారు.


ఈ సినిమా తర్వాత మహేష్ కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు కాని మరోసారి వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా మాత్రం చేస్తాడని తెలుస్తుంది. మహర్షి టైంలోనే మహేష్ కోసం ఓ కథ అనుకున్నాడట వంశీ పైడిపల్లి. మహర్షి కన్నా ముందు మహేష్ కు ఆ కథే చెప్పాడట వంశీ పైడిపల్లి.    


మహర్షితో వంశీ మీద నమ్మకం రావడంతో ఇప్పుడు మరో ప్రయత్నానికి సిద్ధమవుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. మహర్షి లాంటి హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో కూడా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ వంశీ పైడిపల్లి ఇద్దరు కలిసి మరోసారి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: