తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పికీ 8వ వారం పూర్తి కావొస్తుంది.  ఇప్పటి వరకు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి రెండు వారాల తర్వాత వెళ్లిపోయింది. అయితే తమన్నా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తెల్లవారి నుంచే తన ప్రతాపాన్ని చూపించింది.  ఇంటి సభ్యులకు చికాకు పుట్టించేలా ప్రవర్తించింది..ఇక టివి నటుడు రవికృష్ణకు పప్పు అంటూ చుక్కలు చూపించింది. దాంతో ఆమెపై ఇంటి సభ్యులకే కాదు చూస్తున్న ప్రేక్షకులకు కూడా అసహ్యం పుట్టింది..ఒటింగ్ తో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపారు. 

ఆ తర్వాత యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లింది.  ఈమె కూడా వెళ్లగానే అలీ రజా ను టార్గెట్ చేయడంతో ఇంటి సభ్యులకు ఎక్కడో కాలింది. మొదటి నుంచి తమతో కలిసి మెలిసి ఉంటూ అప్పటి వరకు ఎలిమినేషన్ రౌండ్ లోకి వెళ్లని అలీ రజా యాంకర్ శిల్పా చక్రవర్తి రాగానే ఎలిమినేషన్ కావడం..టోటల్ గా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగింది.  దాంతో అప్పటి వరకు అలీ రజాపై ఉన్న అభిమానం శిల్పా చక్రవర్తికి నెగిటీవ్ గా మారింది.  మొత్తానికి మొన్నటి వరకు శిల్పా చక్రవర్తి ఇంటి నుంచి బయటకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..శ్రీముఖితో తనకు ఉన్న గొడవ ఏంటి అనే విషయాలపై స్పందించింది.

బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి మైండ్ గేమ్ ఆడుతోందని.. శ్రీముఖి ఎవరో తనకు తెలియదని.. కానీ ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఏదేదో చెప్పుకుంటోందని తెలిపింది.  రెండు ఈవెంట్స్ లో శ్రీముఖిని నేను కలిసి ఉంటాను..అంతే తప్ప మా మద్య పెద్దగా స్నేహ సంబంధాలు ఏవీ లేవు.  ఆ అమ్మాయిని నేను టీవీలో చూసిందే ఎక్కువ... ఆ అమ్మాయి 'శిల్పగారికి చాలా చరిత్ర వుంది.. నేనంటే శిల్పకి పడదు' అని అనడం విని నేను షాక్ అయ్యాను. తాను అలా చెప్పడం వలన చాలామంది నిజమేనని అనుకునే అవకాశం వుంది. ఎవరు కాదన్నా..అవునన్నా ఆ మాటల ప్రభావం మాత్రం నా ఓటింగ్ పై ఖచ్చితంగా పడి ఉంటుందని భావిస్తున్నాను. 


మరింత సమాచారం తెలుసుకోండి: