మహేష్ కెరియర్ లో ‘దూకుడు’ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ‘ఆగడు’ అతడి కెరియర్ లో ఒక భయంకరమైన ఫ్లాప్. ఈ రెండు సినిమాలను నిర్మించిన నిర్మాతలు ఒకరే. ప్రస్తుతం ఆ నిర్మాతలే దిల్ రాజ్ తో కలిసి అనీల్ రావిపూడి దర్శకత్వంతో మహేష్ తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని తీస్తున్నారు.

సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర తన ట్విటర్ లో చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకు గుబులు పుట్టిస్తున్నాయి. 

‘ఆగడు’ విడుదలై 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అనీల్ సుంకర ఈ కామెంట్స్ చేసాడు. ‘ఆగడు’కు బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ. ఓవర్సీస్ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిందని.. ప్రిమియర్లతోనే 5 లక్షల డాలర్ల మార్కును అందుకున్న తొలి తెలుగు చిత్రం అదేనని అనిల్ సుంకర చెప్పాడు. ‘సరిలేరు నీకెవ్వరు’కు ‘ఆగడు’ స్థాయి హైప్ ‘దూకుడు’ తరహా కంటెంట్ ఉండాలని తాను కోరుకుంటున్నాని ఆశిస్తూ దానికి ‘మీరేమంటారు’ అంటూ మహేష్  అభిమానులను ప్రశ్నించాడు. 

ఈ ప్రశ్నకు మహేష్ అభిమానుల మైండ్ బ్లాంక్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం దూకుడు తరహా కథలు ఇప్పుడు జనం చూడటం లేదు అన్న విషయం తెలిసి కూడ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని ‘దూకుడు’ కంటెంట్ తో అనీల్ రావిపూడి తీస్తున్నాడా అంటూ మహేష్ అభిమానులు బెంబేలు పడిపోతున్నారు. దీనితో మహేష్ అభిమానుల అసహనాన్ని గ్రహించిన అనీల్ రావిపూడి తన మాటలకు క్లారిటీ ఇచ్చాడు. ‘దూకుడు’ కంటెంట్ అంటే బ్లాక్ బస్టర్ కంటెంట్ అనే తప్ప దూకుడు కంటెంట్ కాదని ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కథ వేరు అని అనిల్ సుకర క్లారిటీ ఇచ్చినప్పటికీ ‘సరిలేరు నీకెవ్వరు’ కథ విషయంలో ఎదో జరుగుతోంది అంటూ మహేష్ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

raj